తహశీల్దార్లకు తెలంగాణ ప్రభుత్వం షాక్

తెలంగాణ ప్రభుత్వం తహశీల్దార్లకు షాక్ ఇచ్చింది. నగర పంచాయితీలు, మున్సిపాలిటీల్లో ప్రత్యేక అధికారుల బాధ్యతల నుంచి వారిని తప్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ స్థానంలో ఎంపీడీవోలు బాధ్యతలు తీసుకోనున్నారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి బదిలీ చేసిన తహశీల్దార్లను తిరిగి పాత జిల్లాలకు బదిలీ చేయాలని తెలంగాణ తహశీల్దార్ల సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లతో పాటు సీఎస్ శైలేంద్ర జోషికి వినతి పత్రాలు అందించారు. ప్రభుత్వం తమ విజ్ఞప్తిపై స్పందించకపోతే .. జులై 9 నుంచి 12వ తేదీ వరకు వర్క్ టు రూల్ పనిచేస్తామని అల్టీమేటం జారీ చేశారు. అప్పటికీ స్పందన రాకపోతే 15 నుంచి సామూహిక సెలవులు పెడుతామని హెచ్చరించారు. తహశీల్దార్ల హెచ్చరికలను తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం.. వారిని ప్రత్యేక అధికారుల బాధ్యతల నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com