ఆమ్రపాలికి ఢిల్లీ నుంచి కాల్.. కిషన్ రెడ్డి కార్యాలయంలో..

X
By - TV5 Telugu |12 July 2019 11:21 AM IST
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన బీజేపీ సీనియర్ నేత, సికింద్రాబాద్ ఎంపీ జి. కిషన్ రెడ్డి కొనసాగుతున్నారు. ఆయనకు ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ)గా వరంగల్ జిల్లా మాజీ కలెక్టర్ ఆమ్రపాలిని కేంద్రం నియమించింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్ఎంసీ అదనపు కమిషనరుగా ఆమె బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆమ్రపాలితో పాటు మరో ఐఏఎస్ అధికారి కె. శశికిరణాచారిని కేంద్ర సర్వీసులకు బదిలీ చేశారు. కిషన్ రెడ్డికి ఓఎస్డీగా ఆమ్రపాలి, వ్యక్తిగత కార్యదర్శిగా శశికిరణాచారిని నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com