ఆయేషాకి డి.ఎన్.ఎ టెస్ట్ చేయడానికి వారు ఒప్పుకోలేదు : ఆయేషా మీర తల్లి

X
By - TV5 Telugu |13 July 2019 3:53 PM IST
సీబీఐ కూడా తన కూతురు కేసు విషయంలో న్యాకం చేయకపోతే.. ఇంక ఏ వ్యవస్థను నమ్మం లేమన్నారు ఆయేషా మీర తల్లి. ఇప్పటికే పోలీసులు, రాజకీయ నాయకులుపై తమకు నమ్మకం పోయిందన్నారు. సీబీఐ అధికారులు ఇప్పటికే తమకు డి.ఎన్.ఎ టెస్టు చేశారని.. తమ కూతురు ఆయేషాకి కూడా డి.ఎన్.ఎ చేస్తామంటే.. మత పెద్దలు ఒప్పుకోలేదని.. దీంతో కోర్డు నుంచి అనుమతి తీసుకుని వస్తామని సీబీఐ అధికారులు చెప్పారన్నారు.. తాము సీబీఐకు అన్ని విధలా సహకరిస్తామన్నారు ఆమె. ఆయేషా కేసులో న్యాయం జరిగితే ప్రతి ఆడపిల్ల తల్లిదండ్రులకు ధైర్యంగా ఉంటుంది అన్నారు ఆమె.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com