విద్యార్థులతో కలసి ఐటెమ్‌ సాంగ్‌కు చిందులేసిన ప్రిన్సిపాల్‌

విద్యార్థులతో కలసి ఐటెమ్‌ సాంగ్‌కు చిందులేసిన ప్రిన్సిపాల్‌

చిత్తూరు జిల్లాలో డైట్‌ ప్రిన్సిపాల్‌ ఐటమ్‌ సాంగ్‌కు చిందులు వేస్తూ సందడి చేశారు. క్రమశిక్షణకు మారు పేరుగా నిలుస్తూ వచ్చిన జిల్లా విద్యా శిక్షణ సంస్థ ప్రిన్సిపాల్‌ ఈ నెల 11తో రెండేళ్ల పదవీ కాలం పూర్తైంది. దీంతో ఏర్పాటు చేసిన అభినందన సభలో విద్యార్థులు, టీచర్లతో కలిసి ఐటెమ్‌ పాటలకు ప్రిన్పిపాల్‌ చిందులు వేశారు. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఆ వీడియో వైరల్‌గా మారింది. వీడియోను చూసిన జిల్లా అధికారులు.. ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ రంగారెడ్డి నిర్వాకంపై సీరియస్‌ అయ్యారు.

Tags

Read MoreRead Less
Next Story