టీఆర్ఎస్ ఎంపీ డి.శ్రీనివాస్ మాతో టచ్లో ఉన్నారు : బండారు దత్తాత్రేయ

X
By - TV5 Telugu |13 July 2019 5:31 PM IST
టీఆర్ఎస్ ఎంపీ డి.శ్రీనివాస్తో సహా... పలువురు టీఆర్ఎస్, పార్లమెంట్ సభ్యులు బీజేపీతో టచ్లో ఉన్నారని చెప్పారు... మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ దే అధికారమని ఆయన తేల్చిచెప్పారు. టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమే అని స్పష్టం చేశారు. లోక్సభ ఎన్నికల తర్వాత తెలంగాణలో రాజకీయ పరిణామాలు మారిపోయాయని చెప్పారు. గులాబీ కంచుకోటలను బీజేపీ బద్ధలు కొట్టడంతో ఆ పార్టీలో అంతర్మథనం మొదలైందని దత్తాత్రేయ అన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com