ఏపీకి ఎన్నడూ లేనంత లబ్ధి మోదీ హయాంలోనే జరిగింది - సుజనా చౌదరి
By - TV5 Telugu |14 July 2019 4:07 PM GMT
ఆంధ్రప్రదేశ్కు చరిత్రలో ఎన్నడూ లేనంత లబ్ధి మోదీ సర్కారు హయాంలోనే జరిగిందని... రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరి అన్నారు. గత ఐదేళ్లలో రాష్ట్రానికి ఏం చేసిందన్న దానిపై ప్రజలకు వివరించలేకపోయామని... రానున్న రోజుల్లో అన్ని వివరాలు అంకెలతో సహా వెల్లడిస్తామని ఆయన చెప్పారు. కేంద్రంతో రాష్ట్రాలు ఘర్షణాత్మక వైఖరి అవలంభించడం తగదని... సామరస్య, సానుకూల ధోరణితో ఉండాలన్నారు. మోదీ మాత్రమే దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించగలరని.. అన్ని అంశాలు బేరీజు వేసుకున్నాకే తాను బీజేపీలో చేరినట్లు సుజనా చౌదరి తెలిపారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com