విభజన హామీలను బీజేపీ ప్రభుత్వం నెరవేరుస్తుంది : ఎంపీ జీవీఎల్

X
By - TV5 Telugu |16 July 2019 8:43 PM IST
విభజన చట్టంలో ఉన్న అన్ని హామీలను తమ ప్రభుత్వం నెరవేరుస్తుందని అన్నారు రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు. ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధి అన్ని ప్రాంతాలకు విస్తరించలేదన్నారాయన. అప్పటి పాలకులకు ముందు చూపు లేకపోవటంతో జాతీయ సంస్థలన్ని హైదరాబాద్ చుట్టే ఉన్నాయన్నారు. ఏపీ పది జాతీయ సంస్థలను, పదేళ్లలో ఏర్పాటు చేయాలని విభజన చట్టంలో ఉందని..వాటన్నింటికీ కేంద్రప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు జీవీఎల్.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com