జగన్ పాలన మొత్తం అవినీతి మయం : కన్నా లక్ష్మీనారాయణ

X
By - TV5 Telugu |19 July 2019 4:46 PM IST
జగన్ పాలన మొత్తం అవినీతి మయమన్నారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. ఏపీ సీఎం రాష్ట్ర అభివృద్ధిని పక్కనబెట్టేశారని విమర్శించారు. తిరుపతిలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన కన్నా రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గ్రామాల్లో వైసీపీ కార్యకర్తలు విధ్వంసం సృష్టిస్తున్నారని, ఆ పార్టీ నేతలు భూ కబ్జాదారులుగా మారారని ఆరోపించారు కన్నా. కబ్జాలను అడ్డుకుంటున్న వారిపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెడుతున్నారని విమర్శించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com