ప్రభుత్వాసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం.. ఆసుపత్రి బయట రోడ్డు మీదే గర్భిణీ ప్రసవం
By - TV5 Telugu |20 July 2019 6:22 AM GMT
హైదరాబాద్ బోరబండ పర్వతనగర్ లో దారుణం జరిగింది. ప్రభుత్వాసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంతో ఓ మహిళ రోడ్డు మీదే బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటనపై మహిళ బంధువులు మండిపడ్తున్నారు.
పురిటి నొప్పులతో మరియమ్మ రాత్రి వేళ పర్వతనగర్ ప్రభుత్వాసుపత్రికి వచ్చింది. అయితే అప్పటికే సెకండ్ షిఫ్ట్ సిబ్బంది.. ఆస్పత్రి తలుపులకు గడియ పెట్టి వెళ్లిపోయారు. నైట్ డ్యూటీ సిబ్బంది రాలేదు. దీంతో సుమారు గంటకు పైగా మరియమ్మ ఆస్పత్రి బయటే ఉండిపోయింది. సిబ్బంది వచ్చేలోగా ఆస్పత్రి బయట.. రోడ్డు మీదే బిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డా క్షేమంగానే ఉన్నారు. మరోవైపు విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆస్పత్రి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని మరియమ్మ బంధువులు డిమాండ్ చేస్తున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com