వన్డేలకు గుడ్ బై చెప్పిన పేసర్ లసిత్ మలింగా

X
శ్రీలంక పేస్ బౌలర్.. లసిత్ మలింగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. త్వరలో వన్డే మ్యాచ్ లు ఆడబోనని చెప్పాడు. ఆయన సతీమణి ఫేస్ బుక్ పేజ్ ద్వారా తన రిటైర్మెంట్ గురించి ప్రకటన చేశాడు. బంగ్లాదేశ్తో కొలంబో వేదికగా జరిగిన వన్డే మ్యాచ్ తర్వాత వన్డే మ్యాచ్ ల నుంచి తప్పుకుంటున్నట్లు పేర్కొన్నాడు. కానీ టీ-20 ఫార్మాట్లో మాత్రం కొనసాగుతానని స్పష్టం చేశాడు. వచ్చే ఏడాది జరిగే టీ-20 ప్రపంచకప్లో పాల్గొనాలను తనకు ఉందని మలింగా శ్రీలంక బోర్డును కోరినట్లు ఫేస్ బుక్ పేజ్ లో తెలియజేశాడు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
