46 ఏళ్ల జగన్కు ఉద్యోగం.. 45 ఏళ్ల పెన్షన్ రత్న రాలిపోయింది : నారా లోకేష్
BY TV5 Telugu23 July 2019 11:57 AM GMT

X
TV5 Telugu23 July 2019 11:57 AM GMT
ట్విట్టర్ వేదిక ఏపీ సీఎం జగన్ తీరుపై మండిపడుతున్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్.. 46 ఏళ్ల జగన్కు ఉద్యోగం వచ్చింది.. కానీ 45 ఏళ్ల పెన్షన్ రత్న మాత్రం మాయమైంది అంటూ ప్రభుత్వ తీరును తప్పు పట్టారు లోకేష్. పాదయాత్రలో గుర్తొచ్చిన ప్రజల కాళ్ల నొప్పులు.. సీఎం కుర్చీ ఎక్కిన వెంటనే మర్చిపోయారా అంటూ ట్విట్టర్లో ప్రశ్నించారు. బీసీ, ఎస్టీ మహిళలకు 45 ఏళ్లకే పెన్షన్ అన్న జగన్.. ఇప్పుడు పెనం మీద దోశ తిప్పినంత ఈజీగా మాట మార్చి మోసం చేశారంటూ విమర్శించారు లోకేష్.
Next Story