మేయర్ ఇంటి ముందు ఏటీఎంను పగలకొట్టిన దొంగలు

X
By - TV5 Telugu |24 July 2019 12:49 PM IST
ఖమ్మంలో దొంగలు రెచ్చిపోతున్నారు. మామిళ్లగూడెంలో ఎస్బిఐకు చెందిన ఏటీఎంను గుర్తు తెలియని వ్యక్తులు పగులకొట్టి డబ్బును దొంగలించేందుకు ప్రయత్నించారు. వారి ప్రయత్నం ఫలించకపోవడంతో అక్కడ నుంచి పారిపోయారు. రాత్రి రెండు, మూడు గంటల సమయంలో ఏటీఎంలో దొంగతనానికి పాల్పడి ఉంచవచ్చని స్థానికులు పేర్కొన్నారు. ఖమ్మం మేయర్ ఇంటిముందే దొంగలు రెచ్చిపోయి దొంగతనానికి పాల్పడుతుంటే .. ఇక సామన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఏటీఎం సెంటర్ల వద్ద రక్షణ లేకపోవడం వలనే ఇలా జరుగుతుందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com