ఆర్టీసీ బస్సును ఢీకొన్న సుమో.. నలుగురు స్పాట్లోనే..
By - TV5 Telugu |24 July 2019 3:29 AM GMT
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును సుమో ఢీకొనడంతో తమిళనాడుకు చెందిన నలుగురు వ్యక్తులు చనిపోయారు. తిరుమల శ్రీవారి దర్శనం ముగించుకొని చెన్నై వెళ్తుండగా నగరి కణంమెట్ట వద్ద రోడ్డుపై గుంతను తప్పించబోయి ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును సుమో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరికొందరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com