సభ్యత్వ నమోదుపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టిన టీఆర్ఎస్

సభ్యత్వ నమోదుపై టీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో ఫోకస్ చేసింది. కార్యక్రమం జరుగుతున్న తీరుపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. సమీక్ష సమావేశం నిర్వహించారు. నియోజకవర్గాల వారిగా మెంబర్షిప్ ఇంఛార్జులతో మాట్లాడి... సభ్యత్వ నమోదు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ప్రక్రియలో వెనకబడిన నియోజకవర్గాలకు సూచనలు ఇచ్చారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నియోజకవర్గాల్లో సభ్యత్వ నమోదుపై మరోసారి సమావేశమై సమీక్ష నిర్వహిస్తామని కేటీఆర్ చెప్పారు.
మున్సిపల్ ఎన్నికల కోసం అంతా సమాయత్తం కావాలని కేటీఆర్ పార్టీ నాయకులకు సూచించారు. ఎక్కడా అలసత్వం చూపొద్దని హెచ్చరించారు. బీజేపీ బలంగా ఉన్న మున్సిపాలిటీల్లో సభ్యత్వం విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. బీజేపీ కంటే ఎక్కడా టీఆర్ఎస్ వెనక్కి తగ్గొద్దని కేటీఆర్ ఆదేశించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com