మాజీ ఎంపీ వివేక్తో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ భేటీ

X
By - TV5 Telugu |28 July 2019 9:51 PM IST
మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామితో భేటీ అయ్యారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్రెడ్డి. స్వయంగా వివేక్ నివాసానికి వెళ్లి మంతనాలు జరిపారు. కొన్ని రోజులుగా వివేక్ బీజేపీలో చేరుతారంటూ ప్రచారం సాగుతోంది. ఇటీవలే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను కూడా వివేక్ కలిశారు. ఈ నేపథ్యంలో వివేక్ వెంకటస్వామితో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com