రాజ్యసభలో షార్ట్‌ సర్క్యూట్‌ కలకలం

రాజ్యసభలో షార్ట్‌ సర్క్యూట్‌ కలకలం

రాజ్యసభలో అనుకోని పరిణామం చోటుచేసుకుంది. బెంచ్‌ వద్ద ఉండే మైక్‌ నుంచి పొగ రావడంతో సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఈ ఉదయం రాజ్యసభ సమావేశమైన తర్వాత మాజీ ఎంపీ ఎస్‌ జైపాల్‌రెడ్డి మృతికి సభ్యులు సంతాపం తెలిపారు. ఆ తర్వాత నాలుగో వరుసలో కూర్చున్న భాజపా ఎంపీ కేజే ఆల్ఫోన్స్‌ మైక్‌ నుంచి పొగలు రావడంతో వెంటనే ఆయన అక్కడి నుంచి లేచి మరో సీట్లో కూర్చున్నారు. ఛైర్మన్‌ వెంకయ్యనాయుడుకు ఫిర్యాదు చేయడంతో ఆయన సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. షాట్‌ సర్క్యూట్‌ వల్ల మైక్‌ నుంచి పొగలు వచ్చి ఉంటాయని రాజ్యసభ సభ్యులు తెలిపారు. మైక్‌ను సరిచేయాలని ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు సిబ్బందిని ఆదేశించారు. కాగా.. కేజే ఆల్ఫోన్స్‌కు విద్యుత్‌ షాక్‌ తగిలినట్లు తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story