ఛత్తీస్ఘడ్లో భారీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టులు..
By - TV5 Telugu |3 Aug 2019 5:42 AM GMT
దండకారణ్యం మరోసారి నెత్తురోడింది. తుపాకీ తూటాల చప్పుళ్లతో దద్దరిల్లింది. ఛత్తీస్ఘడ్లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. కూంబింగ్ దళాలు భారీగా పేలుడు సామాగ్రి, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. రాజ్నంద్గావ్ జిల్లా సీతగోటా అటవీప్రాంతంలో ఈ ఘటన జరిగింది. మృతుల్లో అగ్ర నాయకులు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com