చిన్నమ్మకు బీజేపీ నేతల సంతాపం

X
By - TV5 Telugu |7 Aug 2019 1:30 PM IST
కేంద్ర మాజీ మంత్రి సుష్మ మృతిపై తెలంగాణ బీజేపీ నేతలు సంతాపం తెలిపారు. పార్టీ కార్యాలయంలో ఆమె చిత్ర పటానికి పూలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్తోపాటు కేంద్ర మాజీ మంత్రి దత్తన్న పాల్గొన్నారు. విదేశీ వ్యవహారాల మంత్రిగా సుష్మ చేసిన సేవల్ని లక్ష్మణ్ కొనియాడారు. తెలంగాణతో సుష్మకు అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
సుష్మ స్వరాజ్ మృతి దేశానికి తీరని లోటు అన్నారు కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ. పార్టీ నాయకురాలిగా, మంత్రిగా ఆమె చేసిన సేవల్ని ప్రశంసించారు దత్తన్న. దేశంలో శక్తివంతమైన నాయకుల్లో ఆమె ఒకరని అన్నారాయన.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com