ఆ విషయం ఇప్పటికీ అర్థం కావడం లేదు : చంద్రబాబు
ఎన్నికల్లో తెలుగుదేశం ఎందుకు ఓడిపోయిందో ఇప్పటికీ అర్థం కావడం లేదన్నారు చంద్రబాబు 23 సీట్లు ఇచ్చే అంత తప్పు తానేమీ చేయలేదన్నారు. తన రాజకీయ జీవితంలో ఇలాంటి ఎన్నికలు చూడలేదన్నారు. తన కష్టాన్ని ప్రజలు గుర్తించలేకపోయారనే బాధ ఉందన్నారు. తమపై కోపంతో అమరావతిని చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీ వెళ్లిన జగన్.. ప్రధానిని కలిస్తే రాష్ట్రానికి నిధులు అడగాలి కానీ తనపై ఫిర్యాదులు చేస్తున్నారని ఆరోపించారు.
అన్నక్యాంటీన్లకు అన్యాయంగా మూసివేశారని మండిపడ్డారాయన.. ఒక్కో భోజనానికి ఖర్చుచేసింది 5 రూపాయలైతే...వెయ్యి కోట్ల అవినీతి జరిగిందంటూ తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు...అసెంబ్లీలోనూ ఘోరంగా అవమానిస్తున్నారని.. అయనా భయపడేదే లేదన్నారు. చివరికి తన సెక్యూరిటీ కోసం కూడా కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి కల్పించారని ఆరోపించారు చంద్రబాబు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com