పాకిస్థాన్ కు భారీ ఝలక్ ఇచ్చిన చైనా!
By - TV5 Telugu |9 Aug 2019 3:28 PM GMT
కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దుతో రగిలిపోతోన్న పాకిస్థాన్ కు చైనా కూడా భారీ షాక్ ఇచ్చింది. 370 అంశంపై జోక్యం చేసుకోవాలని పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఖురేషి చైనాను కోరారు. అయితే చైనా మాత్రం ఈ విషయంలో ఝలక్ ఇచ్చింది. ఈ సమస్యను రెండు దేశాలు సామరస్యంగా పరిష్కరించుకోవాలని.. దక్షిణాసియాలో శాంతి సామరస్యాలు ఉండేలా చూడాలని.. ఇరుదేశాలకు విజ్ఞప్తి మాత్రమే చేయగలమని స్పష్టం చేసింది. వాస్తవానికి కొంతకాలంగా పాక్ కు.. చైనా సపోర్ట్ చేస్తూ వస్తోంది. ఈ విషయంలో కూడా సపోర్ట్ చేస్తుందనే పాక్ భావించింది. కానీ చైనా ఇందుకు బిన్నంగా నిర్ణయం తీసుకోవడంతో పాకిస్థాన్ కు భారీ షాక్ తగిలినట్లయింది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com