పొలంలోకి మొసలి... పరుగులు తీసిన రైతులు

పొలంలోకి మొసలి... పరుగులు తీసిన రైతులు

సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలంలో వ్యవసాయదారులను మొసలి హడలెత్తించింది. మంజీరా నది అడుగంటిపోవటంతో మొసళ్లు వ్యవసాయ పొలంలోకి వస్తున్నాయి. మాన్ సాన్ పల్లిలోని నర్సింహరెడ్డి పొలంలోకి ఏకంగా ఏడుఅడుగుల పొడవు, రెండు క్వింటాళ్ల బరువు ఉన్న మొసలి వచ్చింది. రైతులు తమ పనిలో నిమగ్నమై ఉన్న సమయంలో మొసలిని చూసి పరుగందుకున్నారు. అటవీశాఖ అధికారులకు సమాచారం అందించటంతో అతి కష్టం మీద మొసలిని బంధించారు.

Tags

Next Story