బైక్ను ఢీకొట్టిన వైసీపీ ఎమ్మెల్యే కారు
By - TV5 Telugu |14 Aug 2019 2:00 PM GMT
నెల్లూరు జిల్లా కావలిలో రోడ్డు ప్రమాదం జరిగింది. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్రెడ్డి కారు.. ఓ బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న శ్రీనివాసులు అనే వ్యక్తికి తీవ్రంగా గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండడంతో అతన్ని ఆస్పత్రికి తరలించారు. ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్రెడ్డి కారు డ్రైవర్ ఓవర్ స్పీడే రోడ్డు ప్రమాదానికి కారణమని ప్రత్యక్షసాక్ష్యులు చెబుతున్నారు.
Also Watch :
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com