కళ తప్పిన ఎన్టీఆర్ ఘాట్.. చెప్పులతో సమాధి పైకి ఆకతాయిలు

X
By - TV5 Telugu |16 Aug 2019 3:26 PM IST
ఉమ్మడిరాష్ట్రాన్ని పాలించిన మాజీ ముఖ్యమంత్రి.. కోట్లాది తెలుగువారి ఆరాధ్యదైవం ఎన్టీయార్. అందుకే ఆయన సమాధి ఉన్న ఎన్టీయార్ ఘాట్ వద్దకు దేశవిదేశీ పర్యాటకులు పెద్దఎత్తున తరలివస్తుంటారు. కానీ కొంతకాలంగా ఘాట్ నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. భద్రత గాలికొదిలారు. పట్టించుకోవాల్సిన అధికారులు మొద్దనిద్రలో ఉన్నారు. దీంతో పవిత్రమైన సమాధి వద్ద నియంత్రణ లేకపోవడంతో కొందరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. సమాధిపైకి ఎక్కి సెల్ఫీలు తీసుకోవడం.. షూ, చెప్పులు వేసుకుని ఘాట్ పైకి ఎక్కడం వంటివి చేస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com