తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఆంధ్రాలో పిడుగులు పడే అవకాశం
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు భారీ వర్షాలు కురవకున్నా.. కృష్ణమ్మ, భద్రాచలం దగ్గర గోదావరి ఉగ్రరూపం దాల్చాయి. లోతట్టు ప్రాంతాలను ముంచెత్తుతున్నాయి. దీనికి తోడు.. తెలంగాణలో మూడు రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్లోని వాతావరణ శాఖ స్పష్టంచేసింది. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని చెప్పారు. సాధారణ వర్షపాతంతో పోలిస్తే రాష్ట్రంలో కాస్త లోటు ఉందని అధికారులు తెలిపారు.
అటు.. ఆంధ్రప్రదేశ్లోను సేమ్సీన్. నైరుతి, పశ్చిమ దిశ నుంచి గాలులు వీస్తుండడంతో రెండు రోజులు వర్షాలు కురుస్తాయని విశాఖలోని వాతావరణ కేంద్రం తెలిపింది. కోస్తాంధ్రలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు కురవొచ్చని అంచనా వేశారు. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు రికార్డు కావొచ్చని అధికారులు తెలిపారు. కరువు సీమ రాయలసీమలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని స్పష్టంచేశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com