మున్సిపల్ కమిషనర్.. మహిళను ఇంటికి పిలిచి చేయబోయిన పని చూస్తే..
By - TV5 Telugu |18 Aug 2019 10:52 AM GMT
ప్రకాశం జిల్లా మార్కాపురం మున్సిపల్ కమిషనర్ నయీం అహ్మద్ దారుణానికి తెగబడ్డాడు. పారిశుద్ధ్య కార్మికురాలిని ఇంటికి పిలిపించి అత్యాచార యత్నం చేయబోయాడు. నయీం అహ్మద్ కబంధ హస్తాల నుంచి ఎట్టకేలకు తప్పించుకుంది బాధితురాలు. అయితే జరిగిందేదో జరిగిపోయిందని.. ఈ విషయం ఎక్కడైనా బయటకు చెప్తే నీ ఉద్యోగం పీకేస్తా అంటూ బెదిరింపులకు దిగాడు సదరు కమిషర్ నయీం అహ్మద్. వారం రోజుల్లో తన ఇంట్లో పని చేసే నలుగురు కార్మికులను మార్చాడు. ఈ విషయం తెలుసుకున్న తోటి కార్మికులు.. కమిషనర్ దుర్మార్గాన్ని ఖండిస్తూ ఆందోళన చేపట్టారు. విధులను బహిష్కరించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com