బీజేపీలో చేరిన టీడీపీ ఎంపీ

బీజేపీలో చేరిన టీడీపీ ఎంపీ

రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో టీడీపీ పరిస్థితి దారుణంగా మారిందని.. అందుకే మనసు చంపుకుని బీజేపీలో చేరుతున్నానని అన్నారు గరికపాటి మోహన్ రావు. చంద్రబాబుపై కోపం లేదని.. ఆయనపై తనకు ఎప్పటికి ప్రేమే ఉంటుందన్న గరికపాటి.. కొందరి వల్లే తెలంగాణలో టీడీపీ కనుమరుగయ్యే పరిస్థితి వచ్చిందన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగిన బీజేపీ బహిరంగ సభలో... ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో గరికపాటి మోహన్ రావుతో పాటు పలువురు టీడీపీ నేతలు బీజేపీలో చేరారు.

Tags

Next Story