వరదతో ముంచి రాజధాని పనికిరాదన్న స్టేట్మెంట్ ఇస్తున్నారు : ఎంపీ సుజనా చౌదరి

X
వరదతో ముంచి రాజధాని పనికిరాదన్న స్టేట్మెంట్ ఇస్తున్నారని వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు ఎంపీ సుజనా చౌదరి. వరదలపై సీడబ్యూసీ హెచ్చరించినా ఏపీ ప్రభుత్వం ఎందుకు అప్రమత్తం కాలేదని ప్రశ్నించారు. వరదలతో రైతులకు అపార నష్టం జరిగిందని దీనికి బాధ్యులేవరని నిలదీశారు. జగన్ సర్కార్ ప్రజలను గందరగోళంలోకి నెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని, హోంమంత్రి సలహాలు తీసుకుంటే .. పీపీఏ రద్దు, పోలవరం కాంట్రాక్టుల విషయంలో కేంద్రం సూచనలను ఎందుకు పరిగణలోకి తీసుకోలేదని ప్రశ్నించారు సుజనా చౌదరి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
