శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొన్న నారా లోకేశ్

X
By - TV5 Telugu |23 Aug 2019 5:46 PM IST
ఏపీ వ్యాప్తంగా శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా శ్రీకృష్ణుడి ఆలయాలకు భారీగా భక్తులు పోటెత్తుతున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి కృష్ణుడి ఆలయంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ప్రత్యేక పూజలు చేయించారు. ప్రత్యేక పూజల తరువాత పూజారులు లోకేష్ను ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు ఇచ్చారు. తరువాత పార్టీ కార్యాలయానికి వెళ్లిన లోకేష్ను కలిసేందుకు వచ్చిన అభిమానులు ఆయనతో సెల్ఫీలు దిగారు.
Also watch :
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com