గుడి వద్ద తల్లీకూతుళ్లను దారుణంగా..
BY TV5 Telugu26 Aug 2019 2:45 AM GMT

X
TV5 Telugu26 Aug 2019 2:45 AM GMT
తూర్పుగోదావరి జిల్లాలో జంట హత్యలు కలకలం సృష్టించాయి. రామచంద్రాపురం పట్టణం గంగమ్మ గుడి వద్ద తల్లీకూతుళ్లను దారుణంగా హత్య చేశారు. సుత్తితో బలంగా కొట్టి వారిద్దరినీ చంపినట్లు అనుమానిస్తు న్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు, హత్యలకు కారణాలను అన్వేషిస్తున్నారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంలు ఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించాయి.
బలస మాధవి దంపతులు తమ ఇద్దరు బిడ్డలతో గంగమ్మ గుడి వద్ద నివాసముంటున్నారు. మాధవి భర్త ఓ హోటల్లో వంట మాస్టర్గా పని చేస్తున్నాడు. శనివారం రాత్రి మాధవి, ఆమె కుమార్తె బలస కరుణపై ఆగంతకులు దాడి చేశారు. కిరాతకంగా తలపై గట్టిగా కొట్టి హతమార్చారు. రక్తపు మరకలను చూసిన స్థానికులు, పోలీసులకు సమాచారమిచ్చారు. ఎస్పీ నయీమ్, ఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు. స్థానికుల నుంచి వివరాలు సేకరించారు.
Next Story
RELATED STORIES
Sini Shetty: మిస్ ఇండియా పోటీల్లో గెలిచిన కర్ణాటక బ్యూటీ సినీ శెట్టి...
4 July 2022 9:38 AM GMTMaharashtra: మహారాష్ట్ర అసెంబ్లీ బలపరీక్షలో నెగ్గిన ఏక్నాథ్ షిండే.....
4 July 2022 9:00 AM GMTMaharashtra: 'సీఎం అవుతానని ఊహించలేదు'.. శాసనసభ సమావేశాల్లో షిండే..
3 July 2022 3:35 PM GMTUdaipur: ఉదయ్పూర్ హత్య కేసు నిందితులపై దాడి.. పోలీసుల సమక్షంలోనే..
3 July 2022 12:30 PM GMTVice President: ఉప రాష్ట్రపతి అభ్యర్ధిపై కొనసాగుతున్న సస్పెన్స్..
3 July 2022 11:53 AM GMTDivorce: 'టీవీ లేకపోతే భార్య ఉండదు..' విడాకులకు వింత కారణం..
2 July 2022 4:15 PM GMT