మంత్రులే రాజధానిపై రోజుకో ప్రకటన చేస్తూ గందరగోళం సృష్టిస్తున్నారు - ప్రత్తిపాటి
By - TV5 Telugu |26 Aug 2019 9:37 AM GMT
రాజధాని విషయంలో మంత్రులు గందరగళ ప్రకటనలు మానుకోవాలన్నారు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు. వేలాది మంది రైతులను మానసిక క్షోభకు గురిచేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. రాజధాని విషయంలో లేనిపోని అపోహలు సృష్టించడం తగదన్నారు. ఒక సామాజికవర్గం భూములు కొన్నదని అసత్యప్రచారాలు మానుకోవాలన్నారు. సిఆర్ డిఏ పరథిలో అన్ని వర్గాలకు చెందిన ప్రజలున్నారని.. ముఖ్యంగా దళితులు, పేదలు అధికంగా ఉన్నారని గుర్తుచేశారు. రాజధాని, అమరావతి విషయంలో ప్రజల్లో ఉన్న సందేహాలకు సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com