కూతురితో సన్నిహితంగా ఉన్నాడని యువకుడిపై పెట్రోల్ పోసి..

కూతురితో సన్నిహితంగా ఉన్నాడని యువకుడిపై పెట్రోల్ పోసి..

చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. తమ కూతురితో సన్నిహితంగా ఉన్నాడన్న కోపంతో.. లోకేష్‌ అనే యువకుడిని పెట్రోల్‌ పోసి తగులబెట్టారు యువతి తల్లిదండ్రులు. మదనపల్లె రూరల్‌ మండలం టేకుపల్లిలో ఈ ఘటన జరిగింది. పెట్రోల్‌ పోసి తగులబెట్టినా చనిపోకపోవడంతో... కరెంట్‌ షాక్‌ ఇచ్చి హత్య చేశారు. తర్వాత నిందితులు పరారయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు పోలీసులు, డాగ్ స్క్వాడ్‌ సాయంతో అమ్మాయి కుటుంబ సభ్యులు ముగ్గురిని పట్టుకునేందుకు గాలిస్తున్నారు.

ఐతే.. హత్యకు గురైన లోకేష్‌పై గతంలో కొన్ని కేసులున్నాయని గుర్తించారు.. అత్యాచారం కేసులో జైలుకి కూడా వెళ్లి వచ్చాడు. వివాదాస్పద వ్యక్తిగా ఈ కుర్రాడికి పేరుంది. ఈ హత్యకు మాత్రం యువతితో ఉన్న సంబంధమే కారణంగా తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story