కూతురితో సన్నిహితంగా ఉన్నాడని యువకుడిపై పెట్రోల్ పోసి..
BY TV5 Telugu29 Aug 2019 5:24 AM GMT

X
TV5 Telugu29 Aug 2019 5:24 AM GMT
చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. తమ కూతురితో సన్నిహితంగా ఉన్నాడన్న కోపంతో.. లోకేష్ అనే యువకుడిని పెట్రోల్ పోసి తగులబెట్టారు యువతి తల్లిదండ్రులు. మదనపల్లె రూరల్ మండలం టేకుపల్లిలో ఈ ఘటన జరిగింది. పెట్రోల్ పోసి తగులబెట్టినా చనిపోకపోవడంతో... కరెంట్ షాక్ ఇచ్చి హత్య చేశారు. తర్వాత నిందితులు పరారయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు పోలీసులు, డాగ్ స్క్వాడ్ సాయంతో అమ్మాయి కుటుంబ సభ్యులు ముగ్గురిని పట్టుకునేందుకు గాలిస్తున్నారు.
ఐతే.. హత్యకు గురైన లోకేష్పై గతంలో కొన్ని కేసులున్నాయని గుర్తించారు.. అత్యాచారం కేసులో జైలుకి కూడా వెళ్లి వచ్చాడు. వివాదాస్పద వ్యక్తిగా ఈ కుర్రాడికి పేరుంది. ఈ హత్యకు మాత్రం యువతితో ఉన్న సంబంధమే కారణంగా తెలుస్తోంది.
Next Story
RELATED STORIES
Maharashtra: శివసేనకు మరోసారి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. పిటిషన్...
1 July 2022 9:00 AM GMTLPG: వాణిజ్య సంస్థలకు ఊరట.. భారీగా తగ్గిన ఎల్పీజీ ధర..
1 July 2022 6:32 AM GMTMaharashtra: సీఎం పదవికి ఉద్ధవ్ థాక్రే రాజీనామా..
29 Jun 2022 4:22 PM GMTMaharashtra: ముగిసిన మహారాష్ట్ర కేబినెట్ భేటీ.. ఉద్దవ్ థాక్రే సంచలన...
29 Jun 2022 2:30 PM GMTPlastic Ban: ప్లాస్టిక్ బ్యాన్.. జులై 1 నుంచి షురూ..
29 Jun 2022 5:48 AM GMTMumbai: సముద్రంలో కూలిన హెలికాప్టర్.. నలుగురు మృతి..
28 Jun 2022 4:00 PM GMT