రాప్తాడు ఎమ్మెల్యే అనుచరుల దౌర్జన్యం
By - TV5 Telugu |1 Sep 2019 4:13 PM GMT
అనంత-కళ్యాణదుర్గం హైవే పనులను రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్రెడ్డి అనుచరులు అడ్డుకున్నారు. ఎన్నికల ఫలితాలు రాగానే రోడ్డు పనులు నిలిపేయాలంటూ కాంట్రాక్టర్కు హుకుం జారీ చేశారు. గత కొన్నిరోజులుగా ఎస్సార్ కన్స్ట్రక్షన్ కంపెనీ రోడ్డు విస్తరణ పనులు చేస్తోంది. రోడ్డు పనులు చేస్తున్న వర్కర్లపై ఎమ్మెల్యే ప్రకాష్రెడ్డి అనుచరులు దాడి చేయగా ఐదుగురికి గాయాలయ్యాయి...ఈ సంఘటన ఆత్మకూరు మండలం పంపనూరు వద్ద జరిగింది. యంత్రాలను ఆపి, తాళాలు లాక్కెళ్లారు ప్రకాష్రెడ్డి అనుచరగణం. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో కాంట్రాక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com