అక్టోబర్లో నిశ్చితార్థం.. వచ్చే ఏడాది పెళ్లి

బాలీవుడ్ బ్యూటీ అలియా భట్.. చాక్లెట్ బాయ్ రణ్బీర్ కపూర్లు చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుంటే ఇండస్ట్రీ అంతా చెవులు కొరుక్కుంది. వీటన్నింటికీ చెక్ పెడుతూ వచ్చే నెలలో నిశ్చితార్థం చేసుకుంటున్నట్లు ప్రకటించింది ఈ జంట. ఆపై 2020లో వివాహం చేసుకుంటామని తమపై వస్తున్న వార్తలకు తెరదించింది. ఏడాది కాలంగా డేటింగ్లో ఉన్న ఈ ఇద్దరూ.. ఈ ఏడాదిలోనే పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ రణ్బీర్ తండ్రి అనారోగ్యం కారణం ఒకటైతే, అలియా భట్ హెల్త్ కూడా బాలేదని పెళ్లిని వచ్చే ఏడాదికి వాయిదా వేసినట్లు సమాచారం.
ఆ మధ్య జరిగిన ఫిలిం ఫేర్ అవార్డు వేడుకలలో రణ్భీర్ 'సంజూ' చిత్రానికి ఉత్తమ నటుడు అవార్డు అందుకోగా, అలియా 'రాజీ' చిత్రానికి గాను ఉత్తమ నటి అవార్డుని ఒకే వేదికపై అందుకున్నారు. ఈ సందర్భంగా అలియా మాట్లాడుతూ.. నాకు ఇష్టమైన, నాకు సంబంధించిన ప్రత్యేకమైన వ్యక్తి ఇక్కడ ఉన్నారు. ఐ లవ్యూ రణ్బీర్ అంటూ మనసులోని మాట చెప్పేసరికి వీరిమధ్య కొనసాగుతున్న ప్రేమాయణం అందరికీ తెలిసింది.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com