బర్త్డే కేక్ తిని తండ్రి, కొడుకు మృతి

X
By - TV5 Telugu |5 Sept 2019 11:01 AM IST
సిద్దిపేట జిల్లా కొమురవేల్లి మండలం అయినాపూర్లో విషాదం చోటు చేసుకుంది. బుధవారం రాత్రి పుట్టిన రోజు వేడుకల్లో బర్త్డే కేకు తిన్న రవి, అతని కుమారుడు రామ్ చరణ్ మృతి చెందారు. భార్య భాగ్యలక్ష్మీ, కూతురు పూజిత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఏరియా జిల్లా ఆసుపత్రిలో వీరికి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. మరోవైపు దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కేక్ ఎక్కడ తెచ్చారన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com