వైసీపీ నేత పుట్టినరోజని.. పిల్లలతో ఇలా చేయిస్తారా?

X
By - TV5 Telugu |5 Sept 2019 4:18 PM IST
విజయనగరంలో ఓ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం అత్యుత్సాహం విమర్శలకు తావిచ్చింది. వైసీపీ నేతకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పించేందుకు పిల్లల్ని గ్రౌండ్కి తీసుకెళ్లి నానా ఫీట్లు చేయించారు. 'హ్యాపీ బర్త్డే చిన్న శ్రీను' అంటూ అక్షరాల ఆకారంలో పిల్లల్ని కూర్చోబెట్టి శుభాకాంక్షలు చెప్పించారు. మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను పుట్టినరోజు సందర్భంగా వైసీపీ నేతలు కోరడం వల్లే ఇలా చేయాల్సి వచ్చిందని యాజమాన్యం వివరణ ఇస్తోంది. ఐతే.. ఎయిమ్స్ స్కూల్ యాజమాన్యం తీరుపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరిదో పుట్టిన రోజు అయితే.. 200 మంది పిల్లల్ని గంటల తరబడి గ్రౌండ్లో కూర్చోబెట్టి.. శుభాకాంక్షలు చెప్పించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com