సీఎం జగన్కు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు లేఖ
ఏపీ సీఎం జగన్కు విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్రావు లేఖ రాశారు. విశాఖ భూ కుంభకోణంపై సిట్ను పునః ప్రారంభించాలని లేఖలో కోరారు గంటా. సిట్ను పునఃప్రారంభిస్తే స్వాగతిస్తామని లేఖలో పేర్కొన్నారు. ఇటీవల జరిగిన జిల్లా అభివృద్ధి కమిటీ సమావేశంలో.. సిట్ను రీ ఓపెన్ చేయాలని వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. దీనిపై స్పందించారు గంటా శ్రీనివాసరావు.
గతంలో కూడా భూకుంభకోణంపై దర్యాప్తు కోరుతూ కేబినెట్ మంత్రి హోదాలో అప్పటి ముఖ్యమంత్రికి లేఖ రాసినట్లు గుర్తు చేశారాయన. అప్పట్లోనే సిట్ నివేదికను బహిర్గతం చేయాలని డిమాండ్ చేసినట్లు లేఖలో పేర్కొన్నారు. ప్రశాంతంగా ఉన్న విశాఖ నగరాన్ని రాజకీయంగా కలుషితం చేయకుండా.. చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రికి రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు గంటా శ్రీనివాసరావు. విచారణకు పూర్తిగా సహకరిస్తామని, వెంటనే నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ లేఖను గత నెల 29 నే ముఖ్యమంత్రి జగన్కు రాశారు గంటా శ్రీనివాసరావు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com