కుమారుడు ఉన్న జైలు గదిలోనే తండ్రి చిదంబరం

కుమారుడు ఉన్న జైలు గదిలోనే తండ్రి చిదంబరం
X

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం తన 74వ పుట్టిన రోజున తీహార్‌ జైల్లోనే గడపనున్నారు. INX మీడియా కేసులో కోర్టు చిదంబరానికి 14 రోజుల రిమాండు విధించింది. దీంతో ఆయన సెప్టెంబర్ 19 వరకూ తీహార్ జైల్లో ఉంటారు. సెప్టెంబర్ 16న ఆయన పుట్టినరోజు. జైల్లోని నార్త్‌బ్లాక్‌లో ఉన్న 7వ నంబర్ గదిలో ప్రస్తుతం చిదంబరం ఉన్నారు.

మొదటిరోజు చిదంబరం జైల్లో సాధారణ ఖైదీలాగే ఉన్నారు. రాత్రి అందరితోపాటు సాధారణ ఆహారం తీసుకుని, తనతో తెచ్చుకున్న మందులను వేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. గతంలో ఇదే కేసులో అరెస్టైన ఆయన కుమారుడు కార్తీ చిదంబరం కూడా జైలు నంబర్7లోనే 12రోజులు గడిపారు. ఇప్పుడు అదే జైలు నంబర్7లో చిదంబరానికి అధికారులు ప్రత్యేక గదిని కేటాయించారు. మిగతా ఖైదీల మాదిరే ఆయనకూ లైబ్రరీ, టీవీ వద్ద నిర్ణీత సమయం గడిపే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు.

అయితే చిదంబరం వయసును దృష్టిలో ఉంచుకుని రాత్రి సమయంలో బీపీ పరీక్షించడానికి ఒక వైద్యుడిని ఏర్పాటు చేశారు. సాధారణంగా 10 మందిని ఉంచే బారక్ ను .. ఆయన కోసం కేటాయించారు. జైల్లో చిదంబరం కోసం ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు చేయలేదని.. జైళ్ల శాఖ డైరక్టర్ జనరల్ సందీప్ గోయెల్ స్పష్టం చేశారు. కోర్టు ఆదేశాలను మాత్రమే పాటిస్తామని తెలిపారు.

Tags

Next Story