వినాయక నిమజ్జనానికి వెళ్లి ఆరుగురు చిన్నారులు..

చిత్తూరు జిల్లా వినాయక నిమజ్జనంలో అపశృతి చోటు చేసుకుంది. ఆంధ్రా-కర్నాటక సరిహద్దులోని కోలార్ జిల్లా క్యేసంబళ్ల సమీపంలోని మరదగట్టా గ్రామంలో ఈ విషాద ఘటన జరిగింది. గణేష్ నిమజ్జనం కోసం సమీపంలోని ఓ నీటికుంట దగ్గరకు వినాయకుడిని తీసుకెళ్లిన పిల్లలు సుమారు ఆరు మంది కుంటలో పడి మృతి చెందారు.
మొదట ముగ్గురు పిల్లలు కుంటలో పడిపోవడంతో.. వారిని రక్షించేందుకు మిగిలిన ముగ్గురు పిల్లలూ ప్రయత్నించారు. ప్రమాదవశాత్తూ వారు కూడా కుంటలో పడిపోయారు. గమనించిన స్థానికులు వెంటనే వారిని బటయకు తీశారు. అయితే అప్పటికే ముగ్గురు పిల్లలు మృతి చెందారు.. మిగిలిన వారిని ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు.. ఒకే గ్రామానికి చెందిన తేజస్వి, రక్షిత్, రోహిత్, వైష్ణవి, ధనుష్లు మృతి చెందడంతో విషాదం నెలకొంది.
Also Watch :
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com