ప్రభుత్వ బెదిరింపులకు తగ్గేది లేదు - చంద్రబాబు

X
By - TV5 Telugu |11 Sept 2019 4:16 PM IST
ఛలో ఆత్మకూరును అడ్డుకోవడంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ప్రజాస్వామ్యంలో ఇదో చీకటిరోజు అంటూ ట్వీట్ చేశారు. వేలాది మందిని హౌజ్ అరెస్టులు చేయడాన్ని ఖండించారు.. వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రాష్ట్రం రావణకాష్టం అయ్యిందన్నారు. ప్రభుత్వ బెదిరింపులకు తగ్గేది లేదని.. బాధితులకు న్యాయం జరిగేవరకు పోరాడుతామని చంద్రబాబు స్పష్టం చేశారు.
ఛలో ఆత్మకూరుని అడ్డుకోవడాన్ని పిరికిపంద చర్యగా అభివర్ణించారు చంద్రబాబు. ఛలో ఆత్మకూరు కొనసాగుతుందన్నారు. వైసీపీ బాధితుల కోసం ఏర్పాటు చేసిన శిబిరం కూడా ఉంటుందని చెప్పారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com