తిరుపతిలో నిరుద్యోగుల వెరైటీ నిరసన
By - TV5 Telugu |14 Sep 2019 10:24 AM GMT
దేశంలో నిరుద్యోగం పెరిగిపోతోందని.. తిరుపతిలో నిరుద్యోగులు వినూత్నంగా నిరసన తెలిపారు. మోదీ టిఫిన్ సెంటర్, మోదీ కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేసి ప్రధానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
తిరుపతిలోని నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట నిరుద్యోగులు వెరైటీగా నిరసన వ్యక్తం చేశారు. ఉన్నత విద్యను అభ్యసించే వారంతా ఉద్యోగాలు లేక ఇబ్బంది పడాల్సివస్తోందన్నారు నిరుద్యోగులు. తమ సమస్యలను ప్రధాని మోదీ పట్టించుకోవడంలేదని ఆరోపించారు.
Also watch :
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com