వైసీపీ నాయకుడు పీవీపీ కంపెనీలో నాటకీయ పరిణామాలు

ప్రముఖ వ్యాపారవేత్త, వైసీపీ నాయకుడు పీవీపీ కంపెనీలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. పొట్లూరి వర ప్రసాద్ కంపెనీలో అకౌంటెంట్ గా పనిచేస్తున్న భానుప్రకాశ్ సోమవారం ఆఫీసుకు వెళ్లి తిరిగిరాలేదని అతని భార్య కూకట్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో తెలంగాణ పోలీసులు భాను ఆచూకీ కోసం ప్రయత్నించారు. అయితే భాను విజయవాడ పోలీసుల అదుపులోనే ఉన్నట్టు గుర్తించారు.
అటు తన అకౌంటెంట్ భాను ప్రకాశ్ కంపెనీలో రూ.10 కోట్లు కాజేశాడని పీవీపీ ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. పీవీపీ ఫిర్యాదుతో విజయవాడ పోలీసులు భానును అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. రెండు రోజుల క్రితం తన కంపెనీలో పనిచేస్తున్న భాను ప్రకాశ్.. ఆర్ధిక మోసానికి పాల్పడ్డాడని విజయవాడ కమిషనర్ కు పీవీపీ ఫిర్యాదు చేశారు. అయితే తిరిగి డబ్బులు కంపెనీకి చెల్లించడానికి భాను అంగీకరించడంతో పీవీపీ కూడా కేసు ఉపసంహరించుకున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి అటు హైదరాబాద్ ఇటు విజయవాడలో పీవీపీ వ్యవహారం కలకలం రేపింది.
Also watch:
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com