స్కూల్ పిల్లల ఆటో బోల్తా
By - TV5 Telugu |17 Sep 2019 6:24 AM GMT
హైదరాబాద్ అబిడ్స్లో స్కూల్ పిల్లలతో వెళ్తున్న ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు పిల్లలకు గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు వారిని బొగ్గులకుంటలోని ఆదిత్య ఆస్పత్రికి తరలించారు. ఓ మైనర్, యాక్టివాను అతివేగంగా నడుపుతూ వచ్చి ఢీకొట్టడం వల్లే యాక్సిడెంట్ జరిగింది. యాక్టివా వచ్చి ఢీకొట్టడంతో ఆటో ఒక్కసారిగా పెద్ద కుదుపునకు లోనైంది. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నించినా కుదరకపోవడంతో బోల్తా కొట్టింది. పిల్లలకు ప్రాణాపాయం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Also watch :
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com