బస్సును ఢీకొట్టిన కారు.. స్పాట్లోనే ..

By - TV5 Telugu |5 Oct 2019 8:32 AM IST
అనంతపురం జిల్లా గుత్తి పట్టణ శివారులో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. 44వ జాతీయ రహదారిపై బస్సు- కారు ఢీకొని ముగ్గురు మృతి చెందారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కారు అతివేగంతో అదుపు తప్పి డివైడర్ను ఢీ కొట్టింది. అంతటితో ఆగక అవతలి వైపు నుంచి ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టింది. దీంతో ప్రమాద తీవ్రత పెరిగింది. కారు ముందుభాగం నుజ్జునుజ్జు కావడంతోనే స్పాట్లోనే ముగ్గురు మృతి చెందారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com