ఎస్బీఐ కస్టమర్లకు బ్యాడ్న్యూస్.. ఇకపై..

దేశంలో అతి పెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటిఎం నుంచి ఇకపై కస్టమర్లకు రూ.2000ల నోట్లు రావు. స్టేట్ బ్యాంక్ ఏటిఎంల నుంచి క్రమంగా పెద్ద నోట్లు కనుమరుగు కానున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సూచనల ప్రకారం స్టేట్ బ్యాంక్ ఏటీఎంల నుంచి పెద్ద నోట్ల బాక్స్లను క్రమంగా తొలగిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు, త్వరలో రూ.500 నోట్లను కూడా క్రమంగా తొలగించే అవకాశం ఉందని బ్యాంకింగ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక భవిష్యత్లో ఎస్బీఐ కస్టమర్లకు రూ.200, రూ. 100 నోట్లు మాత్రమే లభ్యమయ్యే అవకాశం ఉంది. పెద్ద నోట్లను ఏటీఎంల నుంచి క్రమంగా వెనక్కి తీసుకోవడంతో బ్యాంక్ క్యాష్ విత్ డ్రా లిమిట్స్ పెంచే అవకాశం ఉంది. కాగా పెద్ద నోట్ల తొలగింపు వార్తలపై బ్యాంక్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com