ఆర్టీసీ కార్మికుల ర్యాలీలో ఉద్రిక్తత

ఆర్టీసీ కార్మికుల ర్యాలీలో ఉద్రిక్తత

వరంగల్‌లో ఆర్టీసీ కార్మికుల ర్యాలీ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. అదాలత్ సెంటర్‌లో అమరవీరుల స్థూపం వద్ద ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అడ్డుకున్నారు. వారిని అక్కడి నుంచి ఖాళీ చేయించేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఇంతలోనే తోపులాట మొదలైంది. పరిస్థితి అదుపుతప్పడంతో పోలీసులు నిరసనకారులందరినీ అక్కడి నుంచి చెదరగొట్టారు. కొందర్ని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా మహిళలపై పోలీసులు దురుసుగా ప్రవర్తించడంపై ఆర్టీసీ యూనియన్లు ఆగ్రహం వ్యక్తం చేశాయి. తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేస్తుంటే ఇలా అరెస్టులు చేయించడం ఏంటని మండిపడ్డారు.

Tags

Next Story