బస్‌భవన్‌ ముందు నిరసన.. బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌కు గాయం

బస్‌భవన్‌ ముందు నిరసన.. బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌కు గాయం

ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా బస్‌భవన్‌ ముందు నిరనస చేపట్టిన బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌కు స్వల్ప గాయమైంది. రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్న లక్ష్మణ్‌తో పాటు ఆర్టీసీ జేఏసీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. అందరినీ బలవంతంగా జీపుల్లోకి ఎక్కించేందుకు ప్రయత్నిస్తుండగా.. లక్ష్మణ్‌ కంటికి గాయమైంది. నియంతృత్వ కేసీఆర్‌ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు తాము పోరాడుతామని హెచ్చరించారు. ఈ సమ్మెకు ప్రజలు, అన్ని వర్గాలు మద్దతు తెలపాలని లక్ష్మణ్‌ కోరారు.

Tags

Next Story