కత్తులతో దాడి చేసుకున్న పండ్ల వ్యాపారులు

X
By - TV5 Telugu |14 Oct 2019 12:14 PM IST
గన్నవరం గాంధీబొమ్మ సెంటర్ వద్ద పండ్ల వ్యాపారులు పరస్పరం కత్తులతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో కిషోర్ అనే వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. ఇద్దరి మధ్య వ్యాపారలావాదేవీల్లో తలెత్తిన వివాదమే ఘర్షణకు కారణమని తెలుస్తోంది. ఒంటిపై గాయాలతో పోలీస్స్టేషన్కు వెళ్లిన కిషోర్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితుడిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
Tags
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com