మార్కెట్లోకి బజాజ్ చేతక్.. సరికొత్తగా..
By - TV5 Telugu |17 Oct 2019 9:16 AM GMT
ప్రముఖ వాహన తయారీ కంపెనీ బజాజ్.. చేతక్ స్కూటర్ను సరికొత్తగా తయారు చేసి లాంచ్ చేసింది. ఇది ఎలక్ట్రిక్ స్కూటర్. అర్బనైట్ బ్రాండ్ కింద ఇది మార్కెట్లోకి తీసుకు వస్తున్నారు సంస్థ నిర్వాహకులు. చేతక్ స్కూటర్లకు బలమైన బ్రాండ్ ఇమేజ్ ఉన్నందున దాదాపు రెండు దశాబ్దాల తరువాత మళ్లీ మార్కెట్లోకి వచ్చింది. బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ దేశీ మార్కెట్లోనూ, అటు విదేశీ మార్కెట్లోనూ విజయవంతమవుతుందని స్కూటర్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. 2020 జనవరిలో చేతక్ స్కూటర్ మార్కెట్లోకి రానుంది.
Tags
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com