పది పాసైతే చాలు.. పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం.. డైరెక్ట్ రిక్రూట్మెంట్..

X
By - TV5 Telugu |17 Oct 2019 11:25 AM IST
కేవలం పదవతరగతి అర్హతతోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందే అవకాశాన్ని కల్పిస్తోంది పోస్టల్ డిపార్ట్మెంట్. తెలుగు రాష్ట్రాల్లో 3,600 లకు పైగా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఇందుకోసం ఎలాంటి రాత పరీక్షలు ఉండవు. కేవలం టెన్త్లో సాధించిన మార్కుల ఆధారంగానే ఉద్యోగం ఇస్తారు. ఆంధ్రప్రదేశ్లో 2707, తెలంగాణలో 970 పోస్టులు ఉన్నాయి. బ్రాంచి పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచి పోస్ట్ మాస్టర్, డాక్ సేవక్ ఉద్యోగాలు ఉన్నాయి. అయితే మొదటి ప్రయత్నంలో పది పాసైన వారికే ప్రాధాన్యత ఇస్తారు. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. వయసు 18 నుంచి 40 ఏళ్ల మధ్యలో ఉండాలి. దరఖాస్తుకు చివరి తేదీ నవంబరు 14, 2019. వెబ్సైట్: www.appost.in.
Tags
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com