సాగర్ కాలువలోకి దూసుకెళ్లిన కారు.. వాహనం ఉన్న ప్రాంతాన్ని గుర్తించిన రెస్క్యూ టీమ్
![సాగర్ కాలువలోకి దూసుకెళ్లిన కారు.. వాహనం ఉన్న ప్రాంతాన్ని గుర్తించిన రెస్క్యూ టీమ్ సాగర్ కాలువలోకి దూసుకెళ్లిన కారు.. వాహనం ఉన్న ప్రాంతాన్ని గుర్తించిన రెస్క్యూ టీమ్](http://tv5site.vocalwire.com/wp-content/uploads/2019/10/marriage-1.png)
సూర్యాపేట జిల్లా సాగర్లోకి కారు దూసుకెళ్లిన ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది చేపట్టిన రెస్క్యూ ఫలితాన్నిస్తోంది. నీటిలో కారు ఉన్న ప్రాంతాన్ని ఎన్టీఆర్ఎప్ సిబ్బంది గుర్తించింది. జిల్లా కలెక్టర్, ఎస్పీ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. శనివారం మధ్యాహ్నం వరకు కారును బయటకు తీస్తామని అధికారులు చెబుతున్నారు.
శుక్రవారం సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం చాకిరాల వద్ద కారు అదుపు తప్పి నాగర్జునా సాగర్ ఎడమ కాలువలోకి దూసుకెళ్లింది. కారుతోపాటు ఆరుగురు వ్యక్తులు కెనాల్లో కొట్టుకుపోయారు. గల్లంతైన వారంతా సికింద్రాబాద్కు చెందిన వారుగా గుర్తించారు పోలీసులు. ఈ ప్రమాదం మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు.
అంబులెన్స్ డ్రైవర్గా పని చేస్తున్న విమలకొండ మహేశ్ వివాహానికి ఆయన స్నేహితులు.. హైదరాబాద్ఈసీఎల్లోని అంకూర్ ఆస్పత్రిలో పనిచేస్తున్న 11 మంది రెండు కార్లలో వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఒక కారు కాలువలోకి దూసుకెళ్లింది. రోడ్డుపై గుంతలను తప్పించబోయే సమయంలో కారు అదుపుతప్పి కెనాల్లోకి దూసుకుపోయింది. వెంటనే పోలీసులు.. గజ ఈతగాళ్లతో గాలింపు చేపట్టారు. కాల్వలో 18 అడుగుల లోతు ఉండడం, నీటి ఉధృతి ఎక్కువగా ఉండడంతో సహాయక చర్యలకు కొంత ఇబ్బందిగా మారింది. నీటిలో గల్లంతైన వారిలో అబ్దుల్, రాజేశ్, సంతోష్, జాన్సన్, నరేశ్, పవన్ ఉన్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com